NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

SEC : ప్రభుత్వం VS ఎస్ఈసీ కొత్త పంచాయతీ – మళ్లీ కోర్టుకు తప్పదా?

SEC : రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మధ్య మరో కొత్త పంచాయతీ వచ్చి పడింది. ఇప్పటి వరకూ ఎస్ఈసీ పై ప్రభుత్వం, ప్రభుత్వం పై ఎస్ఈసీ కోర్టు మెట్లు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి నుండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎస్ఈసీ, ఎస్ఈసీని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళుతున్నాయి. తాజాగా ఎన్నికల కమిషన్ ఎన్నికలను పురస్కరించుకుని తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ పైనా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించగా కోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

SEC : ap local body elections govt vs sec ఎన్నికల కమిషన్
SEC : ap local body elections govt vs sec ఎన్నికల కమిషన్

SEC :ఏకగ్రీవ పంచాయతీల ఫలితాలు నిలిపివేత

ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు గుర్తించి ఎస్ఈసీ ఆ ఏకగ్రీవాలను ప్రకటించవద్దంటూ ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో 112, గుంటూరు జిల్లాలో 67 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ లు వీటిని ప్రకటించలేదు. ఫలితాలను హోల్డ్ లో పెట్టమని ఎస్ఈసీ ఆదేశించింది. ఆయా జిల్లాలో ఎన్నికల ఫిర్యాదులను పరిశీలించిన తరువాత ఫలితాలను వెల్లడించాలని ఎస్ఈసీ పేర్కొన్నది,. ఎస్ఈసీ నిర్ణయంపై  చిత్తూరు జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్ఈసీపై మరో సారి గుస్సా అవుతున్న అధికార పక్షం

అదే విధంగా పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిమ్మగడ్డ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఏకగ్రీవాలు అవ్వకూడదని రాజ్యాంగంలో గానీ చట్టంలో గానీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓటు నమోదు చేసుకోవడం కూడా తెలియని ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధికారుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టానుసారంగా ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. ఈ ఏకగ్రీవ పంచాయతీ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఒ పక్క ఎన్నికల కమిషనర్, మరో పక్క ప్రభుత్వం మద్య అధికారులు నలిగిపోయే పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టు గడప ఎక్కే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!