Krithishetty : కృతిశెట్టి టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఏమంటూ ఉప్పెన సినిమాలో అవకాశం అందుకొని మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాతో దూసుకొచ్చిందో.. తెలుగు సినిమాలలో అవకాశాలు ఉప్పెన వచ్చి కృతిశెట్టి ఒళ్ళో పడుతున్నాయి. డెబ్యూ సినిమాతో అద్భుతమైన సక్సస్ ని అందుకొని అందరి దృష్ఠిని ఆకట్టుకుంది ఈ యంగ్ బ్యూటీ. ఈ జోరు ఇప్పట్లో తగ్గదని అందరూ అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ యంగ్ హీరోలకి సరైన కుర్ర భామ దొరకడం లేదు.
అయితే ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన 17 ఏళ్ళ అందాల భామ కృతిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలకి బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఛాయిన్స్ అయింది. అందుకే టాలీవుడ్ లో ఇప్పుడు అందరూ హీరోలు కృతి శెట్టి కావాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని కి జంటగా కృతిశెట్టి శ్యాం సింగ్ రాయ్ సినిమాలో నటిస్తోంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి మరొక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Krithishetty : కృతిశెట్టి ని రామ్ కి జంటగా ఎంచుకున్నట్టు తాజా సమాచారం..?
అలాగే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఈ యంగ్ బ్యూటి. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ సినిమాని ప్రకటించాడు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎన్.లింగు సామి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా రామ్ కెరీర్ లో 19 వ సినిమాగా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాని శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రామ్ కి జంటగా కృతిశెట్టి ని ఎంచుకున్నట్టు తాజా సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఇదే నిజమైతే కృతిశెట్టి అకౌంట్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పడినట్టే.