Corona: మహమ్మారి కరోనా వల్ల చాలా రంగాలు నష్టపోయాయని అందరికీ తెలుసు. ఈ మహమ్మారి వల్ల ఏరోజుకారోజు బతికే పేదవాడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ప్రభుత్వాలు ఈ మహమ్మారి కి శాశ్వతంగా పులిస్టాప్ పెట్టాలని భావిస్తున్న గాని.. రోజుకో రకంగా ప్రమాదకరంగా మారుతుంది. కొత్త కొత్త వైరస్లు పుట్టుక గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక దేశాలను మళ్లీ అప్రమత్తం చేస్తూ ఉంది. కరోనా వైరస్ యే అనుకుంటే ఇప్పుడు.. ఆల్ఫా, బీటా, ఘమా తో పాటు డెల్టా అదే రీతిలో డెల్టా ప్లస్ వేరియంట్లు పుట్టుకురావడం మాత్రమే కాక మనిషి శరీరంలో ప్రవేశించి టైం ఇవ్వకుండానే పాడేక్కిం చేస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో సినిమా ఇండస్ట్రీ కూడా అనేక రీతులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా నిర్మాతలు భారీ ఎత్తున డబ్బులు తీసుకువచ్చి సినిమాలు చేస్తూ ఉండటంతో పాటు మరో పక్క.. తేచ్చిన డబ్బుకు భారీ ఎత్తున బ్యాంకులో వడ్డీలు కట్టడం.. వంటివి చేస్తూ సినిమాలు నిర్మిస్తూ ఉండగా.. సినిమా మొత్తం కంప్లీట్ అయి చేతిలో ఉన్న గాని బయట పరిస్థితులు బాగోలేక థియేటర్లో క్లోజ్.. మరోపక్క బ్యాంకుల వద్ద నుండి తెచ్చిన డబ్బుకి వడ్డీలు పెరిగిపోవటం వంటివి ఇటీవల చూస్తూ ఉన్నాం. దీంతో నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.
Read More: Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థ పట్టు ఇంకా కోల్పో లేదని రుజువు చేసిన వార్త..??
ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ లో కొంతమంది హీరోలు నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఇదే రీతిలో మహాసముద్రంలో నటిస్తున్న శర్వానంద్ అదేరీతిలో సిద్ధార్థ ఈ ఇద్దరు హీరోలు.. కరోనా కారణంగా నిర్మాతకు అండగా ఉంటూ.. తమ రెమ్యూనరేషన్లు ఈ విషయంలో సగానికి సగం తగ్గించుకుంటూ.. నిర్మాతకి భారం కాకుండా ఉండటం జరిగిందట. తాజాగా ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇదే రీతిలో పెద్ద సినిమాల హీరోలు కూడా ఇదే బాటలో నడిస్తే నిర్మాతలకు భారం కాకుండానే మరోపక్క సినీ వ్యాపారం దెబ్బతినకుండా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.