Tollywood: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులు అదే రీతిలో సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు జీవిత కథ ఆధారంగా ఇప్పటికే పలు ఇండస్ట్రీలలో సినిమాలు కూడా రావడం జరిగింది. తెలుగులో స్వర్గీయ ఎన్టీఆర్ అదే రీతిలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి.. వంగవీటి రంగా, సావిత్రి బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పుడు మరో లెజెండ్ టాలీవుడ్ పర్సనాలిటీ బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం.
విషయంలోకి వెళితే దర్శకరత్న టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద గా ఉంటూ అనేక రీతులుగా సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి.. వ్యవహరించిన దాసరి నారాయణరావు బయోపిక్ తెరకెక్కించడానికి ధవళ సత్యం అని డైరెక్టర్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి దర్శకత్వం అనే టైటిల్ ఖరారు చేసారు. దాదాపు 100కు పైగా సినిమాలు చేసిన దాసరి నారాయణరావు.. నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించడం జరిగింది. ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తాడివాక రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Read More: Tollywood: డైరెక్టర్ బుచ్చిబాబు సన పుట్టిన స్టోరీ మొదట ఎవరికి వినిపించాడో తెలుసా..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో తాతా మనవడు అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయి.. పలు సెన్సేషనల్ సినిమాలు తీసిన దాసరి నారాయణ 2017లో అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. దర్శకుడిగా చివరి సారిగా ఆయన దర్శకత్వం చేసిన సినిమా ఎర్ర బస్సు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నట్టు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.