Ritu varma : రీతూ వర్మ..తెలుగమ్మాయిగా సత్తా చాటాలని టాలీవుడ్లో అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న నేచురల్ పర్ఫార్మర్ హీరోయిన్స్ లో రీతూ వర్మ ఒకరు. జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘బాద్ షా’ మూవీలో ఒక పాత్ర చేసింది. ఆ తర్వాత నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’ లాంటి కథా బలమున్న సినిమాలతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘పెళ్లి చూపులు’ ఈమెకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. గ్లామర్ రోల్స్ చేయకుండా సింపుల్ గా కనిపిస్తూ మేకర్స్ దృష్టిని ఆకట్టుకుంది.
కెరీర్ ప్రారంభంలో తెలుగు కంటే తమిళంలో చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా రీతూ కెరియర్ ని మలుపు తిప్పింది. ఇక ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో ‘ధృవ నక్షత్రం’ సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిట్ అయితే కోలీవుడ్లో మంచి క్రేజ్ దక్కించుకుంటుంది. ఒక తమిళ సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా మంచి క్రేజీ మూవీస్ చేసే అవకాశం అందుకొని హాట్ టాపిక్గా మారింది.
Ritu varma : టైటిల్ పోస్టర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
తెలుగులో ప్రస్తుతం రీతూ నాని హీరోగా ‘టక్ జగదీష్’లో నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది చిత్ర బృందం. అలాగే మరో యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న ‘వరుడు కావలెను’ సినిమాలో కూడా నటిస్తోంది. లేడీ డైరెక్టర్ లక్ష్మీసౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి కూడా ఇప్పటికే విడుదలయిన టైటిల్ పోస్టర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.