NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RRR: ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వైసిపి ఎంపీల ఎత్తుగడ!ఆర్ఆర్ఆర్ తో పాటు టీవీ5 చైర్మన్ పై ప్రధానికి ఫిర్యాదు!!

RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ నాయకత్వం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది.ఒకవైపు అనర్హత వేటు వేయించడం తో పాటు వీలైతే పెద్ద క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించాలన్న వ్యూహాన్ని కూడా పన్నినట్లు కనిపిస్తోంది. పనిలో పనిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీవీ5 న్యూస్ ఛానెల్ ని కూడా వారు టార్గెట్ చేశారు. సోమవారం చోటు చేసుకున్న పరిణామం ఈ ఊహాగానాలకు బలం ఇస్తోంది.పదిహేను మంది వైసిపి ఎంపీలు నేరుగా ప్రధానిని కలిసి రఘురామకృష్ణంరాజు పై తీవ్రమైన అభియోగాలు మోపుతూఫిర్యాదు చేశారు.వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఈ ఎంపీల బృందానికి నాయకత్వం వహించారు.మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా వారు కలిసి రఘురామకృష్ణంరాజు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

YSRCP MPs complains to Prime Minister about TV5 chairman along with RRR !!
YSRCP MPs complains to Prime Minister about TV5 chairman along with RRR !!

ఎంపీల ఫిర్యాదు సారాంశమేంటంటే?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు వైసిపి ఎంపీలు తెలిపారు. వారిద్దరి మధ్య మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.రఘురామ కృష్ణంరాజు, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైసీపీ ఎంపీలు కోరారు.అయితే రఘురామకృష్ణంరాజు సబ్జెక్ట్ ఒక్కటే అయితే బాగుండదనుకున్నారేమో రాష్ర్టానికి ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్టుల గురించి కూడా ప్రధానికి వారు కొన్ని విజ్ఞప్తులు చేశారు.కాని ప్రధాని నుండి ఏ విధమైన స్పందన వచ్చిందో మాత్రం తెలియడం లేదు.

అదంతా విజయసాయిరెడ్డి విషప్రచారం!

మరోవైపు విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీలు చేసిన ఆరోపణలు, ఫిర్యాదుల మీద రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ అదంతా విష ప్రచారమని పేర్కొన్నారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని,మరి 20 కేసులున్న విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ఆయన ప్రశ్నించారు.తాను కూడా ఏవన్,ఏటు(జగన్ ,విజయసాయిరెడ్డి)ల అవినీతి బాగోతాలను వివరిస్తూ ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.వారిద్దరి డొల్ల సూట్ కేసు కంపెనీల వివరాలన్నీ ప్రభుత్వానికి నివేదించానని, ముందుగా వారిద్దరి పైన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరానన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు తాను బెదరబోనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

 

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?