Virat Kohli: టాలీవుడ్ ఇండస్ట్రీలో మొహమ్మీద చెప్పటంలో.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తల పటంలో ఎప్పుడూ ముందు ఉంటది శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో విషయాలు మాత్రమే కాక రాజకీయ పరంగా ఇంకా సమాజంలో అనేక విషయాల పరంగా.. శ్రీ రెడ్డి తనదైన శైలిలో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ ఉంటుంది. కాగా తాజాగా ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఆడిన మూడో టెస్ట్ లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో.. క్రికెట్ ప్రేమికులు తీవ్రస్థాయిలో ఇండియా బ్యాటింగ్ లైనప్ పై విమర్శలు చేయటం తెలిసిందే. కేవలం 54 నిమిషాల్లోనే బ్యాటింగ్ ఆర్డర్ గొప్ప కూలిపోవడంతో క్రీజులో ఎవరు నిలదొక్కుకోలేక పోవటంతో.. ఇండియా జట్టు ఘోరంగా ఓడిపోయింది.
అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అంటూ శ్రీరెడ్డి మండిపడింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఆవేశం తప్ప.. ఆటలో విషయం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ నీ నియమించాలని..విరాట్ పనికి రాడు అంటూ శ్రీరెడ్డి మండిపడింది. బ్యాటింగ్ పరంగా కూడా విరాట్ కోహ్లీ ఫామ్లో లేడని రిటైర్ అయ్యే టైం దగ్గర పడింది అని పేర్కొంది. కోహ్లీ చెత్త పరమ చెత్త అంటూ తన ఆగ్రహాన్ని శ్రీరెడ్డి వెళ్లగక్కడం తో వెంటనే విరాట్ కోహ్లీ అభిమానులు రంగంలోకి దిగారు.
టీమ్ ఇండియా ని గెలిపించడానికి లో విరాట్ కోహ్లీ గతంలో ఎన్నో విజయాలు.. అందించారని.., లార్డ్స్ టెస్ట్ లో కోహ్లీ పాత్ర లేదా..? అంటూ శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు కోహ్లీ అభిమానులు కౌంటర్లు వేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అభిమానులకు కూడా బదులిస్తూ.. కోహ్లీ పాత్ర లేదని ఇతరుల క్రెడిట్.. నొక్కేశాడు అని శ్రీరెడ్డి గందరగోళ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో బ్యాట్ అభిమానులు క్రికెట్ తెలిస్తే మాట్లాడు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అంటూ శ్రీ రెడ్డి పై మండి పడుతున్నారు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ ఆవేశంగా కాకుండా ఆటతీరు గా జట్టును నడిపించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.