Suhasini: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్..స్టార్ స్టేటస్ వచ్చాక బిజినెస్ మేన్స్ని, లేదా సినీ ఇండస్ట్రీలోనే ఉన్న వారిలో లేక రాజకీయ నాయకులనో పెళ్ళి చేసుకొని సెటిలవుతున్నారు. కొందరు గానీ గాయకులు సంగీత దర్శకులనో, ఆర్ట్ డైరెక్టర్స్నో పెళ్ళి చేసుకుంటుంటే, కొంతమంది నటీ మణులు దర్శకులనో, నిర్మాతలనో, లేక 24 విభాగాలలో ఉన్న వారినో ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నారు. అలా ఉన్న వారిలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవీ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.
సుమలత కూడా అంబరీష్ని పెళ్ళి చేసున్నారు. రాధిక, ప్రముఖ నటుడు శరత్ కుమార్ని పెళ్ళి చేసుకున్నారు. అప్పట్లో సావిత్రి లాంటి, విజయ నిర్మల వంటి వారు ఇండస్ట్రీ వారినే చేసుకున్నారు. విజయ నిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. అలాగే రమ్యకృష్ణ కూడా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్నారు. రమ్యకృష్ణ – కృష్ణవంశీ పెళ్ళి చేసుకొని దాదాపు 18 ఏళ్ళు అవుతోంది. అయితే ఇన్నేళ్ళలో ఎప్పుడు భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Suhasini: భర్త డైరెక్షన్లో సినిమా చేయడం ఇష్టం లేక
అందుకు కథ కుదరకనా లేక భర్త డైరెక్షన్లో సినిమా చేయడం ఇష్టం లేకనా అనేది మాత్రం సస్పెన్స్. ఇప్పుడు రంగ మార్తాండ సినిమాలో చేస్తున్నారు. ఈ లిస్ట్లో సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా ఉన్నారు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్ళి జరిగి కూడా చాలా కాలం అవుతోంది. అయితే మణిరత్నం దర్శకత్వంలో చిన్న వేశం వేయాలని అన్నీ సౌత్ సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్స్ ఆరాట పడుతుంటారు. బాలీవుడ్ స్టార్ కూడా ఎప్పుడెప్పుడు మణిరత్నం సినిమాలో అవకాశం వస్తుందా అని చూస్తారు.
కానీ సుహాసినీ మాత్రం ఆయన స్వయంగా అడిగినా కూడా సినిమా చేసేందుకు ఒప్పుకోలేదట. దీనికి ప్రత్యేకించి కారణాలు ఏవీ లేవని ఓ సందర్భంలో సుహాసినీ వెల్లడించారు. నాకే ఎప్పుడు తన దర్శకత్వంలో నటించాలనే కోరిక కలగలేదు. ఎందుకో కూడా తెలీదు. ఆయనే కాదు..బయట వారు కూడా చాలాసార్లు మీరు మీ భర్త దర్శకత్వంలో ఒక సినిమా చేయొచ్చు కదా అని అడుగుతుంటారు. కానీ నాకే అంతగా కోరిక అనిపించలేదని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఓ సినిమాలో మణిరత్నం దర్శకత్వం వహిస్తే సుహాసినీ నటిస్తే చూడాలని..సిల్వర్ స్క్రీన్ మీద ఆ పాత్ర ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్న వారు చాలా మందే ఉన్నారు.
Suhasini: సుహాసినీ ఓ కీలక పాత్ర చేస్తే బావుంటుందని అనుకున్నారు.
ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియన్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వరాయ్, విక్రం, కార్తి, త్రిష, విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటీ నటులు నటిస్తున్నారు. కనీసం ఇందులో కూడా సుహాసినీ ఓ కీలక పాత్ర చేస్తే బావుంటుందని అనుకున్నారు. కానీ ఆ అవకాశం లేదు. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అయితే భర్త దర్శకత్వంలో తప్ప మిగతా అందరి దర్శకులతో సుహాసినీ చక్కటి పాత్రలు చేస్తున్నారు. అటు తమిళం, ఇటు తెలుగులో ఆమె కోసం అద్భుతమైన పాత్రలు తయారవుతున్నాయి.