Ring Tone: రింగ్ టోన్స్
ప్రస్తుత కాలంలో ఫోన్లు ఎంతగా పెరిగిపొయాయో భక్తి ఆ విధం గానే పెరుగుతూ పోతుంది. గాయత్రి మంత్రం (Gayatri mantram ),మృత్యుంజయ మంత్రం చాలా మంది రింగ్ టోన్స్ గా పెట్టుకుంటున్నారు. ఇలాంటివి చేయడం వలన మంచి ఫలితం పొందడం ఎలా ఉన్నా అవి మనల్ని పతనం వైపుకి తీసుకెళతాయి అని గుర్తు పెట్టుకోవాలి.
Ring Tone: భగవత్ సాక్షాత్కారం
మంత్రరాలు పరమ పవిత్రం అవి ఎప్పుడూ పాటలు గా ఉండకూడదు . ఎందుకంటే మననం చేసేదే మంత్రం కాబట్టి ఎప్పుడు మననం చేస్తూ ఉండాలి తప్ప ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాటిని వాడకూడదు. మూల మంత్రాలను ఎప్పుడు కూడా గురోపదేశం ద్వారా పొంది మనస్సులో చేసుకోవాలి.మంత్రాలు అనేవి పాటలు, భజనలు ఎంతమాత్రం కాదు అని మరువకండి. ఇలా ఎలాపడితే అలా వాటిని వాడటం వలన భగవత్ సాక్షాత్కారం పొందలేము. ఆ తీరుగ చేయడానికి అన్నమాచార్య , త్యాగరాజ వారి అద్భుతమైన కీర్తనలు చాలా ఉన్నాయి వాటిని ఎలాంటి సందేహం లేకుండా పాడుకోవచ్చు.. ఉపదేశం తో మంత్రం పొందిన వారికి మాత్రమే ఆ మంత్రం యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది.కొన్ని మంత్రాలకు అయితే పెద్ద నియమాలుండవు. కొన్ని,కొన్ని మంత్రాలకి మాత్రం ఎక్కువ నియమాలుంటాయి. అలాంటిమంత్రాలలో పంచాక్షరి కూడా ఒకటి. నమశ్శివాయ (Namashivaya) , శివాయ నమః కూడా పంచాక్షరే.
పొరపాట్లు చేయకుండా
ఉపదేశం పొందినవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం పొందని వారు ప్రణవసహితంగా చేయకూడదని శాస్త్రం తెలియచేస్తుంది. ఉపదేశం పొంది ఉండకపోతే శివాయ నమః అని భక్తితో చేస్తే దానికే అతి పెద్ద ఫలితం దక్కుతుంది. ఓం నమశ్శివాయ (om namashivaya) అని పాటలు పాడితే తప్పు అని శాస్త్రమే తెలియచేస్తుంది. అశాస్త్రీయంఅనేది బాగా ఒంటబట్టేసి అసలు శాస్త్రం లో ఉన్నది చెప్తే కోపం వచ్చే పరిస్థితులు వచ్చేశాయి. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేసినా మంచి ఫలితమే ఉంటుంది. ఉపదేశం పొందకుండా చేసే మంత్రానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం తో చేస్తే దాన్ని సిద్ధమంత్రము అని అంటారు. మంత్రాల విషయంలో పొరపాట్లు చేయకుండా నిపుణులు అయినవారిని కనుక్కుని అనుసరిస్తే మంచిది.