Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఎనిమిది మంది మిగిలారు. వీరిలో ఎవరు ఉంటారు ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఎపిసోడ్ లో.. ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు గత మూడు రోజుల నుండి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎపిసోడ్ ఫస్ట్ రోజు.. కాజల్(Kajal), శ్రీరామ్(Sri Ram) కుటుంబ సభ్యులు రాగా రెండో రోజు.. సిరి(Siri), మానస్(Manas), సన్నీ(Sunny) ఇంటి సభ్యులు వచ్చారు. ఇక మూడో రోజు.. పింకీ(Pinky), రవి(Ravi), షణ్ముక్(Shanmuk) కుటుంబ సభ్యులు రావడం జరిగింది.
ఫ్యామిలీ ఎపిసోడ్ లో హౌస్ లో ఫస్ట్ డే పెద్దగా.. హైలెట్ ఏమీ లేవు. కాజల్ శ్రీరామ్ తమ కుటుంబ సభ్యులు చూసి కొద్దిగా భావోద్వేగానికి గురయ్యారు. కానీ రెండో రోజు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేసింది మానస్ వాళ్ల అమ్మగారు. ఫుల్ జోష్ తో… మనాస్ నీ మాత్రమే కాక మిగతా కంటెస్టెంట్ లను బాగా ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిరి వాళ్ళ అమ్మగారు షణ్ముఖ్ కి వార్నింగ్ ఇవ్వటం రెండో రోజు హైలెట్. ఇదిలా ఉంటే మూడు రోజు యాంకర్ రవి వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలు.. రవి కూతురు ఎంట్రీ..అదే టైం లో ఆమె కోసం స్పెషల్ సాంగ్..వేయడం చాలా హైలెట్గా మూడోరోజు సాగింది. ముఖ్యంగా బిగ్ బాస్ నీ చూడాలని కోరటం .. మాత్రమే కాక హౌస్ మొత్తం వెతకటం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే…పింకీ కి సంబంధించి కుటుంబ సభ్యులకు బదులు ఫ్రెండ్ రావటం మనం చూశాం. ఈ సందర్భంగా పింకీ వాళ్ళ ఫ్రెండ్ నువ్వు తెలిస్తే చరిత్ర అవుతుంది, నో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది కేవలం గేమ్ ఆడటానికి సన్నీ..నా ఆల్ టైం ఫేవరెట్. అతడు కూర్చునే విధానం ఇంకా చాలా బాగుంటాయి అంటూ సన్నీ టైటిల్ ట్రోఫీ విన్నర్ రేసులో ఉన్నట్లు…పింకీ కి తెలివిగా హింట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మానాస్ కి సారి..అని పింకీ ఫ్రెండ్ మాట్లాడటం.. ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. పింకీని మానస్ బాగా ప్రభావితం చేస్తున్నట్లు పింకీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఎపిసోడ్లో వ్యవహరించింది. మొత్తంమీద చూసుకుంటే ఫ్యామిలీ ఎపిసోడ్లో.. పింకీ ఫ్రెండ్ సన్నీ టైటిల్ రేసులో ఉన్నట్లు చాలావరకు పింకీ క్లారిటీ ఇవ్వడం జరిగింది.