Pawan kalyan: సాయి ధరమ్ తేజ్ మూవీకి పవన్ నిర్మాత అయినా పెద్ద డిసప్పాయింట్మెంట్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. అందుకు కారణం కూడా సాలీడ్గానే ఉంది. పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఆయన హీరోగా సినిమాలు వచ్చాయి. అలాగే, పవన్ డైహార్ట్ ఫ్యాన్ నితిన్తో కూడా ఆయన
సినిమా నిర్మించారు. అయితే, ఈ బ్యానర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చాలా తక్కువే. ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో కలిసి తన నిర్మాణ సంస్థలో వరుస చిత్రాలను నిర్మించాలని డిసైడయ్యారు. ఎక్కువగా కొత్తవారికి అవకాశాలివ్వాలని కూడా పవన్ నిర్ణయించుకున్నారు.
దాదపు ఈ కాంబినేషన్లో చైన్ మూవీస్ అంటే 15 చిత్రాలను చిన్న, మీడియం బడ్జెట్తో నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందట. ఈ క్రమంలోనే పవన్ ఓ తమిళ సినిమాను తన సంస్థలో నిర్మించాలని భావించారు. ఆ సినిమానే ‘వినోదయ సైతం’. ఈ సినిమాకు ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు హిట్ టాక్ తెచ్చుకుందీ ఈ చిత్రం. ఈ మూవీ కథ, కథనాలు పవన్ కళ్యాణ్కు బాగా నచ్చడంతో తన హోమ్ బ్యానర్లో రీమేక్ చేయాలనుకున్నారు.
Pawan kalyan: మెగా మల్టీస్టారర్ను మిస్ అవుతున్నామని డిసప్పాయింట్ అవుతున్నారట.
అయితే, దీనిని మెగా మల్టీస్టారర్గా పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్తో నటించనున్నారని గత ఏడాది సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే టాలీవుడ్లో మెగా మల్టీస్టారర్గా ఆచార్య రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ – సాయి ధరమ్ కలిసి నటిస్తారనే వార్తలు రాగానే మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఇది కేవలం గాసిప్ మాత్రమేనట. ఇదులో పవన్ నటించడం లేదని హీరోగా సాయి ధరమ్ తేజ్ మాత్రం నటించడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ను పవన్ కళ్యాణ్ మేనల్లుడుతో భారీ బడ్జెట్తో నిర్మించడానికి సిద్దమవుతున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇది మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అయినా మెగా మల్టీస్టారర్ను మిస్ అవుతున్నామని మాత్రం బాగా
డిసప్పాయింట్ అవుతున్నారట.