Trivikram: ‘భీమ్లా నాయక్’ సినిమా మొదలైనప్పటి నుంచి దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ త్రివిక్రమ్ అన్నీ తానై చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకదశలో ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ అని కూడా వార్తలు వచ్చాయి. పేరుకే సాగర్ చంద్ర అని చెప్పుకున్నారు. ఈ విషయంలో తాజాగా నిర్మాత సూర్య దేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్కు చెప్పారట నిర్మాత నాగవంశీ.
దాంతో ఆయన వెంటనే ఈ మూవీ రీమేక్ రైట్స్ కొనమని చెప్పారన్నారని తెలిపారు. కథా నేపథ్యం ఒకటే అయినప్పటికీ, ఒరిజినల్ కథలో లేని చాలా కొత్త అంశాలను ‘భీమ్లా నాయక్’ సినిమాలో చూస్తారని, పవన్ కళ్యాణ్ విశ్వరూపం కూడా ఇందులో చూస్తారని తెలిపారు. ఇక దర్శకుడు సాగర్ కె చంద్ర అయినా కూడా దినికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అలాగే వెనకుండి అన్నీ ఆయనే చూసుకున్నారని చెప్పారు. అయితే, ఇలా ఎందుకో కూడా నాగవంశీ వివరణ ఇచ్చారు.
Trivikram: అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది
ఇంతక ముందు వీరి కాంబినేషన్లో అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో నిర్మాత, దర్శకుడు పవన్కు ఫ్లాప్ ఇచ్చారు. పవన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరచారు. ఆ తప్పును ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమాతో సరి చేసుకోవాలనే ఈ ప్రాజెక్ట్ బాధ్యతను పూర్తిగా త్రివిక్రమ్ శ్రీనివాస్కు అప్పగించినట్టు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే, దర్శకత్వంలో మాత్రం ఆయన ఏమాత్రం ఇన్వాల్వ్ కాలేదని.. ఆ పని మొత్తం దర్శకుడు సాగర్ చంద్రనే చూసుకున్నారని తెలిపారు. ఇక సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని..గ్యారెంటీగా భారీ హిట్ సాధిస్తుందని నమ్మకంగా చెప్పుకొచ్చారు.