Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన `పుష్ప ది రైస్` బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్లుగా చేయగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్తో ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున నటన, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా `పుష్ప ది రూల్` రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎర్రచందనం సిండికేట్ లోని ఒక కూలీ ఆ వ్యాపరంలో డాన్ లా ఎలా ఎదిగాడు అనే లైన్తో సుకుమార్ పుష్పను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా `పుష్ప 2`కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే..ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు సునీల్ శెట్టి. ఈయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారట. ఇప్పటికే సంప్రదింపులు జరిగిపోయాయని.. సెకెండ్ పార్ట్లో బలమైన పాత్రల్లో ఇదొకటని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!