Acharya Ott Release: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ మెగా మల్టీస్టారర్.. అనేక వాయిదాల అనంతరం చివరాఖరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
కానీ, అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమా తీయడంలో కొరటాల మహా దిట్ట. ఈ టాలెంట్తోనే ఈయన టాలీవుడ్లో సక్సెస్ డైరెక్టర్గా ముద్ర వేయించుకున్నారు. అయితే ఆచార్య విషయంలో మాత్రం ఆయన మార్క్ కనిపించలేదు. కథ, కథనం.. రెండూ ఆకట్టుకునే విధంగా ఉండవు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పైగా ప్రేక్షకులు కోరుకునే మలుపు కూడా ఉండకపోవడం సినిమాకు మరింత మైనస్ అని అంటున్నారు. ఇక తొలి రోజే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త వైరల్గా మారింది.
అదేంటంటే.. ఆచార్య డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు ప్రముఖ ఓటీటీ దిగ్గరం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. అలాగే థియేటర్లో విడులైన మూడు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని అధికారిక ప్రటకన రావాల్సి ఉంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!