Asani Cyclone: ఆసని తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా తీర ప్రాంతం వణుకుతోంది. అయితే తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో స్థానికులు బంగారం కోసం వేట కొనసాగిస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతూ..ఈదురు గాలులతో స్థానికులు వణికిపోతున్నారు. కానీ కొందరు మాత్రం వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సముద్రం ఒడ్డున బండ రాళ్లలో బంగారు రేణువుల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. పలువురు ఇంటిల్లిపాదీ తీరానికి చేరుకుని ఇసుకలో అన్వేషన చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Asani Cyclone: తీరం వెంట బంగారం కోసం వెతుకులాట
ఉప్పాడ తీరంలో కోతకు నిత్యం జనావాసాలు, ఆలయాలు సాగర గర్భంలో కలిసిపోయాయనీ, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయాల్లో బయటపడుతూ ఉంటాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. బంగారం దొరుకుతుండటంతో మత్స్యకారులు, స్థానికులు సమీప ప్రాంతాల ప్రజలు ఉప్పాడ తీరంలో తిష్టవేశారు. గత సంవత్సరం నవంబర్ నెలలోనూ బంగారం కోసం జనాలు గాలించారు. ఇప్పుడు మళ్లీ తుఫాను కారణంగా అలలు ఎగిసి పడుతుండటంతో సముద్రంలో కలిసిన బంగారం తమకు దొరుకుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో తీరం వెంట వెతుకులాట సాగిస్తున్నారు. తుఫాను ప్రభావంతో వేరే దేశానికి చెందిన ఓ బంగారు రధం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే.