Nayanthara: సౌత్లో లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన నయనతార.. ఇటీవలె కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఏడేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట.. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
అయితే పెళ్లైన వారానికే తల్లైంది నయనతార. రియల్గా కాదండోయ్.. రీలే. అసలు కథ ఏంటంటే.. ఇటీవల `కణ్మనీ రాంబో ఖతీజా`తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార ఇప్పుడు `ఓ2` (O2) సినిమాతో థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. జీయస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్ ప్రకాశ్ బాబు. యస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మే 17న ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ థ్రిల్లర్ డ్రామాలో నయనతార ఎనిమిదేళ్ళ బాబుకు తల్లిగా అలరించబోతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ఈ అంచనాలను నయన్ ఏ మేర అందుకుంటుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా, తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో లీనా, రిత్విక్, అడకులం, మనోహర్, మురుగదాస్ ప్రధాన పాత్రల్లో పోషించారు.