AP High Court: రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసులు ఎత్తివేశారు, వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపి సర్కార్ కు హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పై నమైదు అయిన పది కేసులను ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ చెవులు కృష్ణాంజనేయులు తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరిస్తే అది కోర్టు దిక్కారం కిందకు వస్తుందని అన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేసులు ఎత్తివేసేటప్పుడు హైకోర్టు అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రభుత్వ న్యాయవాది అనుమతి తీసుకోలేదని తెలిపారు. దీంతో హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఎత్తివేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు. వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ .. తదుపరి విచారణను వాయిదా వేసింది.