Tollywood: బాలీవుడ్ దృష్టి ఇపుడు సౌత్ సినిమాలపై పడింది. బళ్ళు ఓడలు అవుతాయి.. ఓడలు బళ్లవుతాయి అనడానికి నిదర్శనం మన తెలుగు సినిమాలే. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే చులకనగా చూసే బాలీవుడ్ వారికి తెలుగు సినిమా అంటే ఏమిటో చూపిన సత్తా ఒక్క రాజమౌళికే చెల్లింది. బాహుబలి సినిమాతో ప్రపంచమే తెలుగు సినిమావైపు చూసే ప్రయత్నం చేసాడు జక్కన్న. ఇక తాజాగా RRRతో తెలుగు సినిమా స్థాయిని సుస్థిరం చేసాడు. ఆయన వేసిన బాటలో ఇపుడు కొందరు నడుస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అవును.. పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఆ రేంజులో ఆడిన సినిమాలు ఏమిటో చూద్దామా…
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
1. దర్శకుడు SS రాజమౌళి తెరకెక్కించిన సినిమా ”బాహుబలి – ది బిగినింగ్” 2015లో రిలీజై పెనుతుఫాన్నే సృష్టించింది. ప్రభాస్ హీరోగా ఆర్కా మీడియా బ్యానర్ లో రూపొందిన విజువల్ వండర్ ఇది. ఈ చిత్రం, అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి, తెలుగోడి సత్తాను చాటింది.
2. ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి 2’ సినిమా 2017లో రిలీజై ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు వసూలు చేసి హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న 2వ భారతీయ చిత్రంగా రికార్డులు సృష్టించింది.
3. అదే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘RRR’ 2022లో రిలీజై కలెక్షన్ల సునామి సృష్టించింది. కోవిడ్ కాలం తరువాత కూడా సినిమా దుమ్ము లేపింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాకి DVV దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని.. అత్యధిక వసూళ్లు రాబట్టిన 3వ ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
4. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘KGF 2’ 2022లోనే విడుదలై కన్నడిగులు సత్తా ఏమిటో చాటింది. హీరో యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి.. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ మూవీగా నిలిచింది.
5. ఇక చివరిగా నటుడు కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమ్’ తాజాగా విడుదల అయ్యి థియేటర్లలో ఇంకా దుమ్ము దులుపుతోంది. విజయ్ సేతుపతి – ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనువిందు చేసారు. తాజాగా ఇది 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.