Pavitra: తెలుగు సీనియర్ నటి పవిత్ర లోకేష్ పరిచయం అక్కర్లేదు. పాత్ర ఏదన్నా తన హావభావాలతోనే ఆమె నటిస్తుంది. దాంతో ప్రస్తుతం ఆమెకి ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. దాంతో బిజీ నటిగా మారింది. అయితే గత కొన్ని నెలలుగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నరేష్ – పవిత్ర ఇద్దరూ కలిసి ఈమధ్య బయటకి వెళ్లడం.. ఇటీవల మహాబలేశ్వర్ లో ఒక స్వామిజీని దర్శించుకోవడం వంటివి ఈ వార్తలకు ఒకింత బలం చేకూర్చింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Pavitra: సైబర్ పోలీసులకు ఫిర్యాదు?
ఈ విషయమై తాజాగా పవిత్రా లోకేష్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ను క్రియేట్ చేసి, ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాగే కొన్ని రకాల మీడియా సంస్థలు పనిగట్టుకొని తనపైన ఇలాంటి పనికిమాలిన సమాచారాన్ని పదేపదే వేస్తున్నాయని కేసు ఫైల్ చేసింది. తనకు ఇబ్బంది కలిగించేలా.. ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలను రాసేవారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పోలీసులకు తెలిపింది. పవిత్ర ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం:
బేసిగ్గా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న పవిత్ర.. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, మెప్పించింది. దాంతో ఈమె బిజీ నటిగా మారింది. ఈమె చేసిన నటనకి గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకుంది. ఆయనకది రెండో వివాహం. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సుచేంద్ర ప్రసాద్ తో మనస్పర్థల కారణంగా పవిత్ర కొన్నాళ్లుగా తనకి దూరంగా ఉంటోందని టాక్.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!