NewsOrbit
న్యూస్

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన ఇలా.. ప్రత్యేకత ఏమిటంటే..?

PM Modi: బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Modi) తెలంగాణ (Telangana)రాజధాని హైదరాబాద్ నగరానికి రానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా (JP Nadda) ఈ మధ్యాహ్నమే హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండే విధంగా షెడ్యుల్ ఖరారు అయ్యింది. జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ప్రధాని మోడీ ఏపి లో పర్యటించనున్నారు. ప్రధాన పర్యటన నేపథ్యంలో బస, పర్యటన, భద్రతా ఏర్పాట్లు చేశారు.

PM Modi TS AP Tour
PM Modi TS AP Tour

PM Modi: రేపు ఎల్లుండి హైదరాబాద్ లోనే..

ప్రధాన మంత్రి మోడీ పర్యటన షెడ్యుల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరతారు. 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 3 గంటలకు హెలికాఫ్టర్ లో హెచ్ఐసీసీ నోవాటెల్ కి వెళతారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్ హోటల్ లోనే బస చేయనున్నారు. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా జూలై 3న ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని హజరవుతారు. సాయంత్రం వరకూ సమావేశాల్లోనే పాల్గొంటారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధానితో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ తిరిగి నోవాటెల్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 4వ తేదీ ఉదయం బయలుదేరి ఏపిలోని భీమవరం చేరుకుంటారు.

భీమవరంలో..

ప్రధాన మంత్రి నరేంద్ర రాకను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 4న ఉదయం 9.15 గంటలకు బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాఫ్టర్ లో భీమవరం చేరుకుంటారు. భీమవరంలోని ఎఎస్ఆర్ పార్క్ లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలో అల్లూరు సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.  మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదివేల మంది విధులు నిర్వహిస్తున్నారు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?