Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన భక్తులతో మమేకమవుతూ మరోపక్క సెలబ్రిటీలతో సమావేశమవుతూ అనేక ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సద్గురుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) భార్య ఉపాసన(Upasana) సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంలో చాలామంది భక్తులు కూడా అక్కడ ఉండటం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సద్గురు, ఉపాసన మధ్య చాలా సంభాషణలు జరగగా ప్రశ్నల విషయంలో.. పిల్లలకి సంబంధించి సద్గురుని ప్రశ్న వేయడం జరిగింది. సద్గురు మాకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అయింది. ఈ పది సంవత్సరాలు చాలా ఆనందంగా గడిపాము. కానీ ఎక్కువగా చుట్టుప్రక్కల పరిసరాలు ఇంకా చాలా మంది నుండి పిల్లల కనటం గురించి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటని ఉపాసన.. సద్గురుని ప్రశ్నించారు.
దానికి ఆయన సమాధానం ఇస్తూ మీరు పులి అయితే పిల్లలు కనమని చెప్పేవాడిని. ఎందుకంటే భూమి మీద వాటి మనుగడ అంతరించిపోతున్నాయి. ఇక ప్రస్తుతం భూమి మీద రాబోయే 30-35 ఏళ్లలో ప్రపంచ జనాభా.. వెయ్యి కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది. భూమి మీద ఎక్కువగా నీటి శాతం.. ఎక్కువ, దాదాపు ముప్పావు వంతు నీటితోనే ఉంది. ఇంక కొద్దిపాటి భూమి కలిగిన.. ఈ ప్రపంచంలో మనుషులు ఉండేందుకు చోటు సరిపోదు. సో ప్రస్తుతం పిల్లలను కనకపోవటమే గొప్ప సేవ..అంటూ తనదైన శైలిలో సద్గురు జవాబు ఇవ్వటం జరిగింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!