NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

అక్కడ టీడీపీని తాకట్టు పెట్టేశారా..!? కుప్పంలో చంద్రబాబును ముంచిందెవరు..!?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది ..? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలవడంతో ఆ పార్టీ దూకుడు పెంచింది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ చెబుతోంది. అక్కడి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి అని ఇప్పటికే పెద్దిరెడ్డి చెప్పేశారు. ఈ నేపథ్యంలో  ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ఏలా ఉంది..? చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ఏమైనా చేపట్టారా ? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు కుప్పంలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది..? చంద్రబాబు ఏమి చేయనున్నారు..? ఆయన ప్లాన్స్ ఏమిటి ..?అనేది ఒక సారి పరిశీలిస్తే..

 

నమ్ముకున్న నాయకుల తప్పిదాలతో..

ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించిన కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోవడం నిజంగా చంద్రబాబుకు పరాభవమే. చంద్రబాబు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కొందరు నాయకులకు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆ నియోజకవర్గానికి ప్రతి సారి వెళ్లలేరు. ప్రజలను కలుసుకోలేరు. అందుకే కొందరు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలో ఉండగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు నాయకులు దారితప్పారు. అక్రమ లేఅవుట్లు వేయడం, ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో రాయించుకోవడం లాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు పీఏ లాంటి నాయకులు కూడా ఇందులో ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నాయకులను బెదిరింపులకు గురి చేశారు. వారు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ.. ఉంటే సైలెంట్ గా ఉండండి లేదా వైసీపీకి మద్దతు ఇవ్వండి లేకపోతే మీ అవినీతి కార్యక్రమాలు, తప్పులు బయటకు వచ్చేస్తాయి అంటూ బెదిరించారు. దీంతో కొంత మంది నాయకులు వైసీపీలో చేరిపోగా, కొందరు సైలెంట్ అయిపోయారు.

సమయం కోసం వేచి చూసే ధోరణలో చంద్రబాబు

చంద్రబాబు నమ్ముకున్న నాయకులు గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసి ఇప్పుడు వైసీపీ నేతలకు ఇరుక్కోవడం వల్ల కుప్పంలో నేడు ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఇంకా తయారు చేయలేదు. అందుకే అక్కడ టీడీపీ వైసీపీ తాకట్టుకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తే ఎన్నికల సమయానికి వీళ్లు తప్పులు చేయడమో లేక వీళ్లని వైసీపీ లోబర్చుకోవడమో లాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున వేచి చూసే ధోరణలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అక్కడి పరిస్థితులు మొత్తం చంద్రబాబుకు తెలిసినందున ఎన్నికలకు కొద్ది నెలల ముందు అక్కడ నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N