మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో హైదరాబాద్ హైటెక్స్ లో మెగా కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పాల్గొనడం జరిగింది. చిరంజీవి సినిమాకి సంబంధించిన సాంగ్స్ మరియు డైలాగులతో సభా వేదిక పై డాన్సులు వేస్తూ అభిమానులను ఎంతగానో అలరించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మాట్లాడుతూ … అభిమానులను ఈ రీతిగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. గత ఏడాది జరిగిన ప్రమాదానికి మళ్లీ తిరిగి మీ ముందు నిలబడతానని అసలు ఊహించలేదు.
ఇటువంటి తరుణంలో మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి నుండి ఆగస్టు 22 తారీకు వస్తుంది అంటే మాకు అందరికీ పెద్ద పండగ. మాకే కాదు మీకు కూడా పెద్ద పండగ అంటూ అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ మన అందరి తరపున.. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నానో మీకు అందరికీ ఏమైనా తెలుసా..? మీకు అనిపించవచ్చు వీడు సుప్రీం హీరో ఏంట్రా.. మరీ చెబుతారు. మూడో సినిమాకే వచ్చేసిందా అని కూడా మీకు అనిపించవచ్చు. కానీ సుప్రీం పెట్టుకోవడానికి వెనకాల చాలా స్టోరీ ఉంది.
నా చేతికి ఉన్న ఐదు వ్రేలు కనిపిస్తున్నాయా..? అవి అన్నం ముద్ద కలిపి నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి ప్రధాన కారణం మా చిరంజీవి మావయ్య. ఈ విషయం కామన్ గా అందరూ చెబుతారు. కానీ ఇది నిజం. నాకు హిట్స్ వచ్చిన… ఫ్లప్స్ వచ్చిన… పెద్ద పెద్ద సక్సెస్ వచ్చిన దానికి కారణం మా మామయ్య. జీవితంలో ఏ స్థాయికి ఎదిగిన కానీ మా మావయ్య నాతో ఉంటారని.. భావిస్తూ ఆయన పేరు నాతో పాటు ఉండాలని.. ఆయనపై గౌరవంతో సుప్రీం హీరో అని నేనే కావాలని పెట్టుకున్నాను అని ఎమోషనల్ గా సాయి ధరమ్ తేజ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!