బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా .. ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్కు వెళ్లనుంది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ను కూడా వద్దనుకుందట పరిణీతి. సైనా బయోపిక్ తర్వాత పరిణీతి ఓ హాలీవుడ్ రీమేక్లో నటించనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. హాలీవుడ్ చిత్రం ‘ది గర్ల్ ఆన్ ట్రెయిన్’ అనే హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. రిబూ దాస్ గుప్తా దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబ్లిన్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సినిమా రూపొందనుంది. బ్రిటన్లో ఈ సినిమా చిత్రీకరణ జూలై నుండి ప్రారంభమవుతుందని సమాచారం.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!