ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా జవహర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డి డిసెంబర్ 1వ తేదీ (రేపు) బాధ్యతల స్వీకరించాల్సి ఉంది. అయితే ఈ రోజు శుభ ముహూర్తం ఉండటంతో బుధవారమే బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న సీఎస్ సమీర్ శర్మ కొరకు సీఎంఓలో ప్రత్యేక ఓ పోస్టును సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో చీఫ్ సెక్రటరీ హోదాలో సమీర్ శర్మ .. సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా రేపటి నుండి సీఎంఓలో బాధ్యతలు నిర్వహించనున్నారు.
ప్రతి ఒక్కరూ ఏ మంచి కార్యక్రమం, పని చేయాలన్నా మంచి మూహూర్తాన్ని చూసుకుంటుంటారు. అదే విధంగా అధికారులు కూడా విధుల్లో చేరే సమయాల్లో శుభ మూహూర్తాన్ని పండితులను అడిగి తెలుసుకుంటారు. పండితులు, పురోహితులు పెట్టిన మూహూర్తంలో బాధ్యతలు చేపట్టినా, పనులు చేపట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుందని వారి నమ్మకం. పామరుల నుండి పండితుల వరకూ ఇదే విధానం పాటిస్తుంటారు. నాస్తికులు మాత్రం వారము, వర్జం, మంచి రోజు అనేవి చూరుకోరు. మిగిలిన వారు దాదాపుగా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మూహూర్తాన్ని తెలుసుకుంటుంటారు. ఉన్నతాధికారులు కూడా అదే ప్రకారం వారు బాధ్యతల స్వీకరణకు మంచి ముహూర్తాన్ని చూసుకుంటున్నారు. అదే క్రమంలో నూతన సీఎస్ జవహర్ రెడ్డి కూడా పండితుల సలహా మేరకు ఈ రోజే బాధ్యతలు చేపట్టారు అని అంటున్నారు.
ఆలీ కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్ కు హజరై నవవధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్