NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఎల్లుండి ప్రధాని మోడీతో భేటీ.. ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..?

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు మరో సారి ఢిల్లీకి వెళుతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి 28వ తేదీ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో జగన్ భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే సీఎంఓ కార్యాలయం ఇంత వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యలపై ప్రధానితో చర్చించున్నారని సమాచారం.

PM Modi cm ys jagan

 

ఇదే క్రమంలో గత విజ్ఞప్తుల మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.5,036.32 కోట్ల విడుదలకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదే విధంగా అదనపు రుణ పరిమితి, మూడు రాజధానుల అంశం పైనా పీఎం మోడీకి సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్ర సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ ఎటువంటి వైఖరితో ఉన్నది అనే విషయాలపైనా మోడీతో మాట్లాడనున్నారు. ఏపిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలను వైసీపీ ముఖ్యనేతలు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మరో ఏడాదిన్నర పాటు సంక్షేమ పథకాలను యథావిదిగా కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో పూర్తి పదవీ కాలం అయ్యే వరకూ ఆగడమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదా అనే విషయాలపైనా ప్రధాని మోడీ సలహా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు సన్నద్దం అయ్యే సమయం ఇవ్వకుండా గతంలో కేసిఆర్ మాదిరిగానే బీజేపీ పరోక్ష మద్దతుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా లేదా అనే విషయాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా పార్టీ అధిష్టానం అందుకు సముఖంగా లేదన్నట్లుగా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపైనా ప్రధానంగా చర్చ జరుగుతుందని అంటున్నారు. ప్రధాన మంత్రి మోడీ తో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella