NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గ్రామ స్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఆ బాధ్యతలకు ఉపయోగించుకోవాలి – సీఎం జగన్

ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్ధక శాఖ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశిస్తూ గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని అందుకోసం ఎస్ఓపీ తయారు చేయాలన్నారు. పశు సంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ, మత్స్యశాఖపై తాడేపల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో ఈ శాఖలపై తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.

CM YS Jagan

 

వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్ సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజ్ క్లినిక్ తరహా విధానాన్ని అమలు చేస్తున్నామనీ, అలాగే పశు సంవర్ధక శాఖలో కూడా ఈ తరహా లోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలన్నారు. యూనిఫార్మిటీ (ఏకరూపత) తీసుకురావడం ద్వారా మంచి సేవలు అందుబాటులో తీసుకురావచ్చని తెలిపారు. ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు – నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. దీని కోసం ఒక మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలన్నారు. పశుసంవర్ఖక శాఖ అసిస్టెంట్ల సమర్ధత పెంచాలన్నారు.

cm ys jaga

 

ప్రతి మండల స్థాయిలో ఉన్న వ్యవస్థ నుండి ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ కు పూర్తి స్థాయి మద్దతు, సహకారం ఉండాలన్నారు. ఏపిలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రానికి పంజాబ్, చత్తీస్ గడ్, కేరళ కు చెందిన అధికారులు వచ్చి సందర్శించి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు 4,765 ఏహెచ్ ఎ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే సందర్భంలో జగనన్న పాల వెల్లువ, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఆక్వా రంగంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.

AP CM YS Jagan

 

తొలుత వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ మరింత విస్తృత పరిచేందుకు గానూ కొత్తగా మరో 165 అంబులెన్స్‌ లను క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు. అంబులెన్స్‌ లలో పరికరాలను, పనితీరును పరిశీలించారు సీఎం జగన్. ఈ కార్యక్రమాల్లో మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపి అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసి) వై మధుసూధన్ రెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri