అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. నార్పల నుండి పుట్టపర్తికి హెలికాఫ్టర్ లో జగన్ వెళ్లవలసి ఉంది, అయితే హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు జగన్. జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ప్రారంభోత్సవానికి గానూ ఇవేళ సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక విమానంలో ఈ ఉదయం గన్నవరం నుండి పుట్టపర్తి వెళ్లిన సీఎం జగన్ .. అక్కడి నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో సింగనమల నియోజకవర్గం నార్పల కు వెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తిరిగి పుట్టపర్తి వెళ్లే సమయంలో హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ విషయాన్ని తెలియజేయడంతో సీఎం జగన్ నార్పల నుండి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణం అయ్యారు.
కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి బుధవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుండి జగనన్న వసతి దీవెన పథకం డబ్బులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు.
YS Jagan: పంచతంత్రంలో ముసలి పులి కథ మాదిరిగా చంద్రబాబు తీరు అంటూ విమర్శలు గుప్పించిన సీఎం జగన్