Chiranjeevi: హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రి క్యాన్సర్ సెంటర్ చిరంజీవి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పై అవగాహన ఉండాలని తెలియజేశారు. తనకి క్యాన్సర్ పై అవగాహన ఉండటం వల్ల గతంలో.. క్యాన్సర్ బారిన పడకుండా తృటిలో తప్పించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియా లలో చిరంజీవి క్యాన్సర్ బారిన పడినట్లు భారీ ఎత్తున వార్తలు రాయడం జరిగింది. దీంతో వచ్చిన వార్తలపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను.
రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు” అని క్లారిటీ ఇవ్వటం జరిగింది. తప్పుగా అర్థం చేసుకున్నారని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది.