దివంగత నేత వంగవీటి మోహన రంగా 76వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఇవేళ జరుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో రంగా అభిమానులు ఉన్నారు. రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో జరిగిన మోహన రంగా జయంతి కార్యక్రమంలో ఆయన తనయుడు వంగవీటి రాధా కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి రాధా రంగ మిత్ర మండలి సభ్యులకు రాధా తినిపించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా కృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రిని కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరూ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. భౌతికంగా దూరమైనా కొన్నితారాలకు స్పూర్తి ఇచ్చారన్నారు.
నేటికీ రంగాను దేవుడిగా ఆదరించడం ఆయన చేసిన మంచిని చెబుతుందన్నారు. భవిష్యత్తులో రంగా అభిమానులు అందరూ ఐకమత్యం చూపాలని కోరారు. రంగా పేరు చెప్పుకుని నాయకులుగా కొందరు ఎదిగారనీ, వారు పట్టించుకోకపోయినా ప్రజల మనసుల్లో రంగా ఉన్నారన్నారు. రంగా పేరు చెప్పుకునే పాలకులే ఆయన పేరు జిల్లాకు ఎందుకు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన సమయంలో కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెడతారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం వద్ద ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధులు గట్టిగా ప్రతిపాదించి ఆమోదం పొందలేకపోయారు.
దీంతో వంగవీటి మోహన రంగా పుట్టిన ప్రాంతం విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎన్టీఆర్ పుట్టిన గ్రామం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నిమ్మకూరు కాగా ఇది మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో ఉంది. వంగవీటి రాధా కృష్ణ తాజాగా జిల్లాకు మోహనరంగా పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మోహనరంగా పేరు జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో నేతలు విఫలమైయ్యారు అని చెప్పకతప్పుదు.
ఇదే సందర్భంలో తన తండ్రి 1987 లో నిర్మించిన చైతన్య రధం సినిమా గురించి వివరించారు. తన తండ్రి మోహన రంగా నిర్మించిన చైతన్య రథం సినిమా కోసం అబిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారనీ, ఒక ప్రింట్ దొరికితే దానిని సరి చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించామని ఇవేళ రంగా జయంతి సందర్భంగా దానిని అమెరికాలో రిలీజ్ చేశారని చెప్పారు. సాంకేతిక అంశాలు పూర్తి చేసుకుని త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. లాభాపేక్ష లేకుండా ఈ సినిమాను సోషల్ మీడియాలో ఉచితంగా అందరూ చూసేలా చేస్తామని తెలిపారు.
AP BJP: సోముకు షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం..ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!