Keerthy Suresh: దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లలో గ్లామర్ పాత్రలు చేయడంలోనూ ఇంకా నటనకు డిమాండ్ ఎక్కువగలిగిన సినిమాలు చేయడంలోను కీర్తి సురేష్ నీ మించిన మరో హీరోయిన్ లేదని చెప్పవచ్చు. ఒక విధంగా కీర్తి ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. “మహానటి” సినిమాలో కీర్తి నటన విశ్వరూపం ఆమెకు జాతీయ అవార్డు వచ్చేలా చేసింది. కరోనా అంతకుముందు కీర్తి సురేష్ కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కరోనా తర్వాత కీర్తి సురేష్.. మహేష్ బాబు జంటగా నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ అయింది.
ఆ తరువాత నానితో నటించిన దసరా కూడా భారీ విజయం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ల అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే… కీర్తి సురేష్ మొట్టమొదటిసారిగా తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త ఇటీవల బయటపడింది. ఈ సొట్ట బుగ్గల సుందరి “నేను శైలజ” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత మహానటితో అందరి దృష్టిని ఆకర్షించి పాపులారిటీ దక్కించుకుంది. ఇలా ఉంటే కీర్తి సురేష్ బాలనాటిగా పలు సినిమాలు చేయటం జరిగింది అంట. అది కూడా మలయాళ భాషల్లో మూడు సినిమాలు చేసిందట. తన చిన్నప్పుడు తొలి పారితోషకం ₹500 తీసుకుందట.
ఈ విషయాన్ని కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఇటీవల వెల్లడించారు. తండ్రి ప్రొడ్యూసర్ తల్లి నటి కావడం వల్ల ఆమె చిన్నతనంలోనే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటం చాలా తేదికైందట. 2000వ సంవత్సరంలో కీర్తి సురేష్ తన తండ్రి నిర్మించిన పైలెట్స్ అనే సినిమా ద్వారా కెమెరా ముందుకు రావడం జరిగింది అంట. ఆ సమయంలో తానే తన కూతురికి పారితోషకం కింద 500 రూపాయలు ఇవ్వడం జరిగిందట. ఇలా ఉంటే ప్రస్తుతం ఈ డ్యూటీ ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్.