హైదరాబాదు: సౌదీ అరెబియాలో అష్టకష్టాలు పడుతున్న మరో యువకుడు తనను రక్షించాలంటూ వేడుకుంటున్నాడు. తన ఆవేదనను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు వీడియో సందేశం ద్వారా పంపాడు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన మహమ్మద్ సమీర్ (21) జీవనోపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు.
నిజామాబాద్కు చెందిన ఏజంట్ సౌదీలో ఫంక్షన్ హాలులో పని ఇప్పిస్తానని ఆశ చూపిస్తే 80వేల రూపాయలు ఇచ్చాననీ, తీరా ఇక్కడకు వచ్చిన తరువాత తనను గొర్రెల కాపరిగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కెటిఆర్ను ఉద్దేశించి సమీర్ తన ఆవేదనను వ్యక్తం చేయగా ఆ వీడియోను మరుపాక అనిల్ కుమార్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కెటిఆర్ స్పందించారు.
భారతదేశంలోని సౌదీ అరేబియా రాయబారి, సౌదీలోని ఇండియా రాయబారి కార్యాలయానికి కెటిఆర్ సమాచారం అందించి బాధితుడు సమీర్ను ఇండియా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!