Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుంది. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండిటిలో మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా గుంటూరు కారంలో కొత్త మహేష్ బాబుని త్రివిక్రమ్ చూపించినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ స్పీచ్ ఇచ్చారు. త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో గతంలో జరిగిన మ్యాజిక్.. మళ్లీ ఈ సినిమాలో జరిగిందని వివరించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో సినిమా యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఒక పెద్ద ఇల్లు సెట్టింగ్ తో పాటు ఫైట్ సీన్స్ చూపించారు. పక్క మాస్ గా మహేష్ బాబుని చూపించడం జరిగింది. శ్రీలీల కూడా ఈ వీడియోలో రివాల్వర్ పట్టుకొని సందడి చేసింది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా మహేష్ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా వచ్చేసరికి తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కించారు. మహేష్ బాబు తల్లి పాత్రను సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపిస్తుంది. ట్రైలర్ లో ఈ విషయాన్ని రివీల్ చేయడం జరిగింది. మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” 2022 మే నెలలో విడుదల అయింది. ఆ తరువాత “గుంటూరు కారం” సినిమా స్టార్ట్ చేసి… 2023 ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించటం జరిగింది.
అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట అనుకున్నా హీరోయిన్ పూజా హెగ్డే మధ్యలోనే డ్రాప్ అయింది. తర్వాత మహేష్ బాబు కుటుంబ సభ్యులు మరణించడంతో అనేకమార్లు సినిమా షూటింగ్ వాయిదా పడటంతో కొంతమంది టెక్నీషియన్స్ కూడా డ్రాప్ అయిపోయారు. చివరకు గత ఏడాది నుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని డిసెంబర్ నెలలో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకు “గుంటూరు కారం” థియేటర్లలో సందడి చేయటానికి సిద్ధమయ్యింది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు పోస్టర్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా ఫలితం ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా నెలకొంది.