ఏపీలో జనసేన – టిడిపి కూటమిలోకి బిజెపి వచ్చి చేరింది. ఈ మూడు పార్టీల పొత్తుతో చాలాచోట్ల టిడిపి, జనసేన నాయకులు సీట్లు త్యాగం చేయక తప్పని పరిస్థితి. ఒక నియోజకవర్గంలో బాబాయ్ సీట్ కోసం కొడుకు త్యాగం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదో విచిత్రమైన పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో రాజకీయం రంజుగా మారింది. బిజెపితో టిడిపి పొత్తు కుదరడంతో జమ్మలమడుగు అభ్యర్థిగా ఎవరు ఫిక్స్ ? అవుతారు అన్నది అంతుపట్టటం లేదు. ప్రస్తుతం జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నారు.
భూపేష్ రెడ్డికి టిడిపి ఇన్చార్జి వచ్చేలా చక్రం తిప్పింది ఆదినారాయణ రెడ్డి అన్న ప్రచారం ఉంది. టిక్కెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో యేడాదికాలంగా విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు బిజెపితో పొత్తు కుదరడంతో జమ్మలమడుగు టికెట్ తనకే అని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. తన సీటు కోసం టిడిపితో పొత్తు ఉండాలని ఆదినారాయణ రెడ్డి ముందు నుంచి కోరుకుంటున్నారు. ఆయన కోరుకున్నట్టుగానే ఇప్పుడు టిడిపితో పొత్తు ఖరారు అయింది. పొత్తుత్తిలో భాగంగా జమ్మలమడుగు సీటు బిజెపి కోరనుంది.
అదే జరిగితే టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉన్న భూపేష్ రెడ్డి పరిస్థితి ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే రాజకీయాల్లో బంధుత్వాలకు తావులేదు. భార్య భర్తలే వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరో ఎందుకు ? ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పరుచూరులో పోటీ చేస్తే.. పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ఈ ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఇప్పుడు జమ్మలమడుగు పంచాయితీని కూడా చంద్రబాబు చాలా తెలివిగా వారి చేతిలోనే పెట్టేసి ఆయన చేతులు దులిపేసుకుంటారని అంటున్నారు. ఆదినారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన పేరుకు బీజేపీలో ఉన్నా కూడా చంద్రబాబు సొంత మనిషి అంటారు. ఆయనకే సీటు ఇవ్వాలని బాబు ప్లాన్. అయితే భూపేష్రెడ్డి నుంచి సహజంగానే మరి నా పరిస్థితి ఏంటి న్న ప్రశ్న ఎదురవుతుంది.
మీరూ మీరు ఒకే కుటుంబం కాబట్టి.. టిక్కెట్ ఎవరికి కావాలో మీరే తేల్చుకోవాలని చంద్రబాబు చాలా సింపుల్గా వాళ్లమీదే నెట్టేయాలని ట్రై చేస్తారు. చివరకు అటూ ఇటూ చేసి భూపేష్రెడ్డిని ఒప్పించి చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికే సీటు వచ్చేలా చేస్తారని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణుక్యంలో భూపేష్రెడ్డి బలిపశువు కాక తప్పదనే అంటున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!