Nindu Noorella Saavasam: పిల్లల్ని పెద్దల్ని కాపాడడానికి ఇంటికి వచ్చావు కదా అని అరుంధతి అంటుంది.నాకు రాథోడ్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విషయం నీకెలా తెలుసు అక్క అని భాగమతి అంటుంది.అంటే తనని చాలా రోజులుగా చూస్తున్నాను తన మాట తీరు ప్రవర్తన తీరు వేరేలా ఉంటుంది అందుకే నువ్వు వచ్చావేమో అని అనుకున్నాను అందుకే కలిసి వెళ్దామని వచ్చాను అని అరుంధతి అంటుంది.అయినా తప్పంతా ఆయన వైపుదే అక్క అ మనోహరిని చిన్నప్పటినుంచి ఫ్రెండ్లా చూసుకుంది కాబట్టి ఆవిడ పేరు అడ్డం పెట్టుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని భాగమతి అంటుంది. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్లలో లోపాలు చిన్నగా కనపడతాయి అంటారు అందుకేనేమో తన లోపాన్ని కనిపెట్టలేకపోయింది అనాధగా పెరగడం చాలా కష్టం మిస్సమ్మ గుడి దగ్గర కంటే అనాధ ఆశ్రమంలోనే ఎక్కువగా పెరుగుతారు స్మశానం కంటే అనాధాశ్రమంలోనే పిల్లల ఏడుపులు ఎక్కువగ వినపడతాయి అని అరుంధతి అంటుంది.
నేను అర్థం చేసుకోలేకపోయాను అక్క అని భాగమతి అంటుంది. నువ్వెందుకు బాధపడుతున్నావ్ మిస్సమ్మ అంత మంచే జరుగుతుంది లే అని అరుంధతి అంటుంది. ఆవిడ మాట వచ్చినప్పుడల్లా అలా ఉంటుందా ఎలా ఉంటుందని అనుకోవడమే కానీ ఆవిడ ఫోటో చూడలేదు అక్క వెళ్లి చూస్తాను అని భాగమతి అంటుంది. మిస్సమ్మ ఇప్పుడు బట్టలు చదువుతున్నావ్ గా తర్వాత చూద్దువులే అని అరుంధతి అంటుంది. లేదక్కా ఎప్పుడు అలాగే అంటూ మిస్ అయిపోతున్నాను వెళ్లి చూడాల్సిందే అని భాగమతి వెళ్తుంది. కట్ చేస్తే, ఆంటీ మీ కోడల్ని ఎప్పుడు చూద్దాం అన్నా కుదరలేదు ఒక్కసారి నీ కోడలు ఫోటో చూపిస్తారా అని భాగమతి అడుగుతుంది. ఇంకెక్కడి కోడలు లేమా ఇంకో కొత్త కోడలు వస్తుంది కదా ఎంత ప్రయత్నించినా ఆ బంగారు తల్లి ప్లేస్ లో ఈ మనోహర్ని చూడాల్సి వస్తుంది అని శివరామ్ అంటాడు. అంకుల్ మీకు పెళ్లి ఇష్టం లేదా అని భాగమతి అడుగుతుంది. ఆ మనోహరి అరుంధతి ఫ్రెండ్ అని తప్ప నాకు నచ్చలేదు అని శివరామ్ అంటాడు.
ఇవన్నీ పక్కన పెడితే పిల్లల్ని బాగా చూసుకుంటుంది కదా అది చాలదా మనకి అని నిర్మల అంటుంది. ఏది మంచో ఏది చెడో తెలియడం లేదుకానీ ఈ పెళ్లిలో తప్పు ఉందని అర్థం అవుతుంది అని శివరామ్ అంటాడు. పెళ్లిలో తప్పు ఉంటే ఆ దేవుడే ఆపేస్తాడు ఆంటీ అన్నట్టు మంచే ఉంటే ఏ ఆటంకం ఉంచిన పెళ్లి జరిపిస్తాడు అయినా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయి అని చెబుతారు కదా అందుకని మీరు ప్రశాంతంగా ఉండండి అంత మంచే జరుగుతుంది అని భాగమతి అంటుంది. ఎంత టెన్షన్లో ఉన్నా నీ మాటలు మాకు ఊరట నీ స్థాయి మిస్సమ్మ అని శివరామ్ అంటాడు. ఆంటీ ఫోటో చూడొచ్చా అని భాగమతి అంటుంది. అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిర్మల ఫోటో తీసి చూపించబోతూ ఉండగా రాథోడ్ వచ్చే మీసమ్మ ని పిలుస్తాడు. కట్ చేస్తే, ఏదో కరువు పడ్డట్టు ఈరోజు ఎందుకు అలా తింటున్నారు అని నీలా అడుగుతుంది. అమర్ పెళ్లికొప్పుకున్నాడని కడుపునిండా తినాలని నాకు నచ్చినవన్నీ వండించుకున్నాను అని మనోహరి తినబోతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ వచ్చి మిస్సమ్మ మిస్సమ్మని గట్టిగా అరుస్తూ ఉంటాడు. రాథోడ్ కి అసలు పని లేదు అని మనోహరి అనుకుంటుంది. ఏంటి రాథోడ్ అని భాగమతి అంటుంది. ఇంట్లో పెద్దలు ఎవరు పనులు చూడాల్సిందే ఎవరు అని రాథోడ్ పంతులు గారిని పిలుస్తారు. మిస్సమ్మ పంతులుగారిని నువ్వు పిలిపించావా ఎందుకు అని నిర్మల అడుగుతుంది. మా అక్క కోసం అని భాగమతి అంటుంది
నీకు ఇంట్లో అక్క ఉందా అని శివరామ్ అంటాడు. మనోహరి అక్క కోసం అని భాగమతి అంటుంది. నువ్వు పంతులు గారిని ఎందుకు పిలిచావు అని శివరామ్ అంటాడు. అరె పెళ్లి చేయాలంటే పంతులుగారు ఉండాలి ముహూర్తాలు పెట్టాలి కదా మా అక్క పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆకాశమంత పందిరి వేయకపోయినా ఏదో సింపుల్ గా నైనా చేయాలి కదా అని భాగమతి అంటుంది. పెళ్లి టాపిక్ ఎలా తీసుకురావాలని నేను ఆలోచిస్తుంటే ఈ భాగీ ఇంత సింపుల్గా తీసేసింది ఏదైతేనేం నాకు మంచి పని చేసింది అని మనోహరి సంతోషపడుతుంది. అందుకే ముహూర్తం పెట్టిద్దామని పంతులు గారిని పిలిచాను అక్క అని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నటిస్తుంది భాగమతి. మీ అక్క చెల్లెళ్ల ఎమోషన్ పక్కనపెట్టి అమ్మాయిని పిలవండి ముహూర్తం పెట్టాలి అని పంతులుగారు అంటారు. ఇంత మంచి అమ్మాయిని కోడలుగా వస్తున్నందుకు మీరు అదృష్టవంతులు అని పంతులుగారు అంటారు. పంతులుగారు పెళ్లికూతురుని నేను కాదు ఈవిడ అని మనోహర్ని చూపెడుతుంది భాగమతి. ఈవిడెంటి అంత ముదిరిపోయింది అని పంతులుగారు అంటారు.
అదేంటండి అలా అంటారు అని భాగమతి అంటుంది. కొంచెం కాదమ్మా బాగా ముదిరిపోయింది అని పంతులుగారు జాతకం చూసి ఇలాంటి జాతకాన్ని నా జన్మలో చూడలేదు అని అంటాడు. అదేంటి పంతులుగారు అలా అంటున్నారు అని నిర్మల అంటుంది. నేను చూసిన జాతకాలలో ఇలాంటి దరిద్రపు జాతకం నాకు కనిపించలేదు అని పంతులుగారు అంటారు. ఏ పూజ అయినా చేద్దాం ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ పెళ్లి మాత్రం జరగాలి అని భాగమతి అంటుంది. ఏమన్నా తిన్నావా అమ్మ అని పంతులుగారు అంటారు. తిందామని ప్లేట్లో పెట్టుకునేసరికి గొడవ స్టార్ట్ అయింది అని మనోహని అంటుంది. ఇంకా రెండు రోజుల వరకు భోజనం తినకు ని జాతక0లో ఉన్న దోషాలని తొలగిపోతాయి అని పంతులుగారు చెబుతారు. అమ్మ బాగి ఇదా నీ ప్లాను ఏం తెలివితేటలు నా చెల్లికి అని అరుంధతి అనుకుంటుంది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవద పంతులుగారు అని మనోహరి అడుగుతుంది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవద్దమ్మా లేదంటే దోష నివారణ జరగదు అని పంతులుగారు అంటారు. ఈ ఉపవాసం రేపు పెట్టుకోకూడదా అని మనోహరి అంటుంది.బేషిగ్గా పెట్టుకోవచ్చు పెళ్లికూడా వచ్చే జన్మలోపెట్టుకోవచ్చు అని పంతులుగారు వెళ్ళిపోతారు.
కట్ చేస్తే, మంగళ మనోహరి కి ఫోన్ చేసి బయటికి రమ్మని చెబుతుంది. ఏంటి ఎందుకు వచ్చావు అని మనోహరి అంటుంది. ఆ తండ్రి కూతుర్లు ఏదో కుట్ర పండుతున్నారమ్మా పెళ్లికి ముందు మీ ఇంట్లోకి వచ్చిందంటే తనేదో ప్లాన్ చేస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి మా ఆయన నన్ను కుక్కని చూసినట్టు చూస్తున్నాడు కొంచెం డబ్బు ఉంటే ఇవ్వండి అమ్మ అని మంగళ అంటుంది. అయిపోయిందా నీ సోది నిన్ను నా పెళ్లి చేయమంటే ఏమైనా చేసావా నా బాగి చెల్లి మాత్రం పంతులు గారిని పిలిపించి నాకు ముహూర్తం పెటేలా చేసింది అని మనోహరి అంటుంది. ఆ భాగి మాటలు నమ్మకండి మేడం అని మంగళ అంటుంది.నా వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరు నాకు అర్థం అవుతుంది నువ్వు వెళ్ళిపో అని మనోహరి అంటుంది. ఇంతలో భాగమతి అక్కడికి వస్తుంది. పిన్ని నువ్వేంటి ఇక్కడ నాన్న ని ఒక్కండి ని వదిలేసి వచ్చావా అని భాగమతి అంటుంది. మీ నాన్న కి మనిషి తోడుండే అవసరం లేదమ్మా ఇక నేను వెళ్తాను పనులు చాలా ఉన్నాయి అంటూ మంగళ వెళ్ళిపోతుంది. అక్క ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఉపవాసం చేయవా అని భాగమతి అంటుంది. నా తిప్పలేవో నేను పడతాను అని మనోహరి అంటుంది. ఇంకా ఇప్పుడే ఏమున్నాయి అక్క ముందు ముందు చాలా ఉన్నాయి అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది