RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచారు. మొన్ననే బుచ్చిబాబు దర్శకత్వంలో “RC16” ప్రాజెక్టు షూటింగ్ పూజా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కాగా తాజాగా సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. చరణ్ కెరియర్ లో నటనకు ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. చెవిటి వాడిగా రామ్ చరణ్ నటన సినిమా చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో వచ్చిన “రంగస్థలం” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.
మళ్లీ ఇప్పుడు సుకుమార్… రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధం కావడం సంచలనగా మారింది. హోలీ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ “RC17” ప్రాజెక్ట్ రాబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందే సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం చరణ్ “గేమ్ చేంజర్” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా బుచ్చిబాబుతో ప్రాజెక్టు కూడా మొదలు పెట్టడం జరిగింది. “గేమ్ చేంజర్” అయిన వెంటనే ఒకపక్క బుచ్చిబాబు మరోపక్క సుకుమార్ సినిమాలతో చరణ్ బిజీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ “RRR” రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు కావస్తోంది. దీంతో ఇకనుండి వరుస పెట్టే సినిమాలు రిలీజ్ చేయాలని చరణ్ భావిస్తున్నారు. మరోపక్క దర్శకుడు సుకుమార్ “పుష్ప 2” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. “పుష్ప 2” అనంతరం చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లి వేగవంతంగా పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నారు.