తెలుగులో గోల్డెన్ లెగ్గులుగా పేరు తెచ్చుకున్న నాయికలు రాశీ ఖన్నా, రశ్మిక మందన్న. ఊహలు గుసగుసలాడే తర్వాత కూడా రాశీ ఖన్నా నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే రష్మిక తొలి చిత్రం చలోతోనే హిట్ కొట్టింది. వీరిద్దరికీ తొలి హీరో నాగశౌర్య కావడం గమనార్హం. తొలి చిత్రాన్ని నాగశౌర్యతో కలిసి నటించిన ఈ భామలు ఇప్పుడు మరో హీరో సరసన ఒకే సినిమాలో కనిపించనున్నారు. ఈ తాజా చిత్రం హీరో విజయ్. విజయ్ అనగానే విజయ్ దేవరకొండ అని అనుకునేరు. కాదు… తమిళ హీరో విజయ్. తమిళ హీరో విజయ్ ఇప్పుడు బిగిల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన లోగేష్ కనకరాజ్ చిత్రంలో నటించనున్నారు. సందీప్ కిషన్ నటించిన నగరం చిత్రానికి ఈ లోగేష్ కనకరాజ్ దర్శకుడు. తాజాగా ఆయన విజయ్తో తీసే సినిమా కోసం ఈ ఇద్దరి భామలను అనుకుంటున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ సమయంలో ఆయన రష్మిక పేరు ప్రకటించారు. ఇప్పుడు మాత్రం అందరికీ సడన్ సర్ప్రైజ్గా రాశీ పేరు వినిపిస్తోంది. సో ఆల్రెడీ తమిళ సినిమాల మీద ఓ కన్ను వేసిన రాశీ, ఇప్పుడిప్పుడే తమిళంలో అడుగుపెడుతున్న రష్మిక కలిసి చేస్తున్న సంగతులు ఇవన్నమాట..
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!