అమరావతి: ‘తాజా’ సభల్లో బిజెపి నేత రాంమాధవ్కు జరిగిన అవమానంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నేడు ఆయన స్పందించారు. పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని కన్నా దుయ్యబట్టారు.
అవి తానాసభలు కాదు టిడిపి భజనసభలు అని కన్నా ఎద్దేవా చేశారు. రాంమాధవ్ జాతీయవాద ప్రసంగాన్ని అడ్డుతగిలి అవమానించింది లోకేష్ గ్యాంగ్ పనేననీ కన్నా ఆరోపించారు. మరో సారి తమ నీచబుద్ది బయటపెట్టారని కన్నా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వారి బురద రాజకీయాల్లో నుండే కమల వికాసం జరుగుతుందనీ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
వాషింగ్టన్ డీసిలో జరిగిన 22వ తాజా సభలకు గౌరవ అతిధిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ప్రవాసాంధ్రులు గోల చేశారు.
అవి'తానాసభలు' కాదు 'టీడీపీ భజనసభలు'
పచ్చతమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువాళ్ళ ప్రతిష్ట దిగజారుస్తున్నారు.
రాంమాధవ్ గారిని ఆహ్వానించి ఆయన జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించి లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారు.
ఏపీలో మీబురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది pic.twitter.com/SsEkmXA9qt— Kanna Lakshmi Narayana (@klnbjp) July 8, 2019
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!