న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని అదే అధికరణలోని నిబంధన కింద రద్దు చేయలేమనీ కాంగ్రెస్ పార్టీ ఎంపి చిదంబరం అన్నారు. ఆర్టికల్ 370,35 ఎ తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని అన్నారు. ఈ నిర్ణయం తప్పని చరిత్రే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు. భారతదేశ చరిత్రలో నేడు చాలా విచారకరమైన రోజు అని చిదంబరం అన్నారు. జమ్ము కశ్మీర్ను రెండు ముక్కలు చేయవద్దని చిదంబంరం విజ్ఞప్తి చేశారు.
ఎంపి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ దేశానికి జమ్ము కశ్మీర్ తలగా ఉండేదనీ, ఇప్పుడు దాన్ని బిజెపి ప్రభుత్వం నరికేసిందని అన్నారు. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని అజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.