అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు కొనసాగిస్తున్నారు.అయిదు వేల వేతనంతో పని చేసే గ్రామ వాలంటీర్ కు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎకసెక్కాలాడుతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.
అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్ సైనికులకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని @ncbn ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు? @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 7, 2019
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!