న్యూఢిల్లీ: గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్రను రక్షణ శాఖ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని ప్రభుత్వ రంగ సంస్థ డిఅర్డిఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఒదిషా తీరంలో బంగాళాఖాతం పైన పయనిస్తున్న సుఖోయ్ యుద్ధవిమానం నుంచి దీనిని ప్రయోగించి కదిలే టార్గెట్ను ఛేదించారు.
Smooth video of the Astra air to air missile test from the Su 30MKI.
Released by DRDO. pic.twitter.com/KNoziEB4pP
— Manu Pubby (@manupubby) September 17, 2019
అస్త్ర క్షిపణి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఎదురుగా వస్తున్న మరో మిస్సైల్ గమనాన్ని రాడార్ సాయంతో, సెన్సార్ల సాయంతో లెక్కించిన అస్త్ర ఎదురుగా వెళ్లి దానిని ఛేదించింది. 300 కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాలను ఛేదించగలిగే విధంగా అస్త్రను అభివృద్ధి చేసేందుకు డిఆర్డిఓ కృషి చేస్తున్నది. ప్రస్తుతానికి భారత వాయుసేన సుఖోయ్ యుద్ధవిమానాలలో రష్యా తయారీ ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లను ఉపయోగిస్తున్నది. ఇజ్రయెల్ తయారీ ఐ-డెర్బీ మిస్సైళ్లనూ, అస్త్రనూ ఉపయోగించాలన్నది రక్షణశాఖ ఆలోచన.