(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ను వరించింది. స్వీడన్లోని స్టాక్హోమ్లో శుక్రవారం నోబెల్ కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. శాంతి స్థాపన కోసం, అంతర్జాతీయ సహకారం కోసం ఆయన చేసిన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. ఇథియోపియా సరిహద్దు దేశమైన ఎరిత్రియాల మధ్య 20 ఏళ్లుగా నెలకొన్న వైరాన్ని తొలగించడం, సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రధాని అబీ అహ్మాద్ అలీ చేసిన కృషికిగాను నోబెల్ అవార్డు కమిటీ ఆయన పేరును ప్రకటించింది.
Watch the very moment the 2019 Nobel Peace Prize is announced.
Presented by Berit Reiss-Andersen, Chair of the Norwegian Nobel Committee.#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/EIATBAMVp7
— The Nobel Prize (@NobelPrize) October 11, 2019
గత కొన్ని సంవత్సరాలుగా ఇథియోపియా, ఎరిత్రియా దేశాల మధ్య వైరం ఉంది. అయితే, 2018 ఏప్రిల్లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అబీ.. వెంటనే ఎరిత్రియాతో శాంతి చర్చలకు పునాది వేశారు. ఎరిత్రియా అధ్యక్షుడు అవెరికితో చర్చలు ప్రారంభించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రెండు దేశాల మధ్య స్నేహం చిగురించింది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారు. అలాగే తన నిర్ణయాలతో ఇథియోపియా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న ఆయనకు శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు.