నెల్లూరు: అనేక మాఫియాలకు నెల్లూరు అడ్డాగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాఫియా కోరల్లో నెల్లూరు నగరం చిక్కుకుందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు వేయాలన్నా అధికారులకు వాళ్ళ ఉద్యోగ భద్రత గుర్తుకు వస్తుందని అన్నారు.
ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా శాండ్ మాఫియాతో పాటు కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఇలా ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు నగరం ఉందని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారంగా నలుగురు ఎస్పిలను మార్చిన ఘనత నెల్లూరుకే దక్కుతుందని అన్నారు. మాఫియా ఆగడాలకు నెల్లూరు నగరంలో బలవుతున్న వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.