అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. శుక్రవారం సాయంత్రం మస్తాన్ రావు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు.
శనివారం మధ్యాహ్నం ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతున్నారు.
గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి చేతిలో బీదా పరాజయం పాలయ్యారు.
రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చొరవ తో బీదా మస్తాన్ రావు వైసిపిలో చేరుతున్నట్లు సమాచారం.