NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పీకే అంటే ఎంత “మమతో”…!

పొలిటికల్ మిర్రర్ 

పీకేపై ఈగ కూడా వాలకూడదు. పీకేకి దోమ కూడా కుట్టకూడదు. పికెపై కనీసం మారు మనిషి నీడ పడకూడదు. పీకే మన రాష్ట్రానికి ‘ముఖ్యమంత్రి’ స్థాయి ఉన్న ముఖ్య అతిథి. ఈ భావనలన్ని ఎవరివో తెలియక తికమక పడొద్దు. విషయమేంటంటే రాజకీయ సూత్రధారి పీకే ఆలియాస్ ప్రశాంత్ కిషోర్కి Z కేటగిరీ భద్రత కల్పిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్య అతిథిగా తిరిగి వెళ్లొచ్చు. దేశంలోని చాలా మంది సీఎంలకు ఉన్న ఈ భారీ భద్రత ఈ పొలిటికల్ ఎనలిస్టుకి పశ్చిన బంగాలో కల్పించారు. ఎందుకు? అక్కడ ఆయన అంత ముఖ్యమా? ఆ రాష్ట్ర ప్రభుత్వం పికెపై ఎందుకు అంత ప్రేమ ఒలకబోస్తుంది..? అనేది పరిశీలిస్తే….!

రాష్ట్రంలో “మమత” మార్కు..!

పశ్చిమ బంగ రాష్ట్రం… అది 2011 మే..! శాసనసభ ఎన్నికల్లో 295కి గాను184 సీట్లు గెలుచుకుని మమత బెనర్జీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అక్కడి మొదలు తన మార్కు నిర్ణయాలు, పాలనతో రాష్ట్రంలో చక్రం తిప్పారు. వివాదాస్పద నిర్ణయాలు, దూకుడు పాలనతో విమర్శలుపాలైనప్పటికీ… ప్రజల్లో పట్టు సాధించి, మళ్ళీ 2016 ఎన్నికలు వచ్చేసరికి ఆమెనే ఆ రాష్ట్ర ఓటర్లు గెలిపించారు. 295 సీట్లకి గాను 211 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుని, ఆమె వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బిజెపి అంటేనే ఒంటికాలుతో లేస్తారు మమత. మోడీ, అమిత్ షా ద్వయంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దేశమంతటా బీజేపీని ఓడించాలని మొన్నామధ్య చంద్రబాబు, కాంగ్రెస్ తో కలిసి కూటమి కూడా కట్టారు. అందుకే మమతని ఎలాగైనా గద్దె దించాలని బిజెపి ఎత్తులు వేస్తుంది. ఎలాగైనా తాను మూడోసారి గెలిచి తన పట్టు నిలుపుకోవాలని మమత సిద్ధమవుతున్నారు. అందుకే రానున్న శాసనసభ ఎన్నికలు పశ్చిమబెంగాల్ లో అప్పుడే రాజకీయ కాకని రగిలించాయి.

పీకే అక్కడ కీలకం ఎందుకంటే…!

ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్రంలో ఇప్పుడు కీలకమయ్యారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఆ రాష్ట్రంలో ని 42 పార్లమెంటు స్థానాలకు గాను18 స్థానాలొచ్చాయి. 2014లో కేవలం 2 మాత్రమే గెలిచిన బిజెపి 2019 నాటికి పుంజుకుంది. అందుకే ఇప్పుడు అక్కడ మమతకి సరైన ప్రత్యామ్నాయం బిజెపి అని జనంలో ఉంది. బీజేపీని, ఆ పార్టీ నిర్ణయాలను బలంగా విమర్శిస్తున్న నాయకుల్లో మమత కీలకంగా ఉండడం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటూ జాతీయవాదంతో దేశమంతటా బిజెపి గాలి ఉండడం, స్వ రాష్ట్రంలో తనకు రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువవ్వడం, గత రెండేళ్లలో తృణమూల్ నాయకులపై కేసులు, ఇబ్బందులతో పార్టీకి దూరమవుతుండడంతో మమతకి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టు మారాయి. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అందుకే మమత తనకు తోడుగా ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నారు. ఏడాది కిందటే పీకే తో ఒప్పందం చేసుకున్నారు. “దీదీకో బోలో” అంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా దేశంలో సీఏఏ, ఎన్ఆర్ సి లను బలంగా వ్యతిరేకిస్తున్న వారిలో పీకే కూడా ఉన్నారు. తనలాగే ఆయాన కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే ఆయనకు భద్రత ముఖ్యం అని భావించిన దీదీ వెంటనే పీకేకి Z కేటగిరీ భద్రత కల్పించేశారు. పికెపై ఈగ కూడా వాలకుండా, సంపూర్ణ రక్షణ కల్పించి తనకు తోడుగా నిలిచేలా చేసుకున్నారు దీదీ. ఇదే మమత మార్కు అంటే.

శ్రీనివాస్ మానెం 

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

Leave a Comment