NewsOrbit
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..

ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి

చంద్రబాబు డైరెక్షన్‌లో ఈసి రమేష్ కుమార్ నడుస్తున్నారు. అందుకు బాబు మాటలే నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొని ప్రజలను ఇబ్బందులపాలు చేయాలనే కుట్రతోనే ఈసితో చంద్రబాబు చేతులు కలిపి ఎన్నికలు వాయిదా వేయించారు.

ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. విదేశాల నుండి వచ్చిన వారు ఇళ్లల్లోనే ఉండాలి. వారి కోసం హోమ్ ఐసోలేటెడ్ చర్యలు చేపట్టాం. విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల క్వారెంటైన్ ఫెసిలిటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తేలిన తర్వాతే ఇళ్లకు పంపుతున్నాం. ఇప్పటి వరకూ ఏడు వేల మంది తెలుగువారు విదేశాల నుండి ఏపికి వచ్చారు. ఇటలీ, స్పెయిన్, ఇరాక్, సౌత్ కొరియా, జపాన్ నుండి వచ్చిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు

సిఎం జగన్మోహనరెడ్డి కులాల గురించి మాట్లాడటమేమిటి. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది. ఈసిపై జగన్ వ్యాఖ్యలు సిఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు, కేంద్రం నిధుల విడుదలకు సంబంధం లేదని రమేష్ కుమార్ చెప్పినా వైసిపి నేతలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. జగన్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి.

టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించినా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదు. కరోనా భయంతో జనం వణికిపోతుంటే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. స్పీకర్ పదవికి తమ్మినేని అనర్హలు, వైసిపి నేతలు కోర్టు ముందు డిజిపి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు.

టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు

సిఎం జగన్ తీరుతో భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎన్నికల కమిషన్‌ను విమర్శించే హక్కు జగన్‌కు ఎవరిచ్చారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే నిధులు రావనేది అవాస్తవం. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాను కేంద్రం కూడా తప్పుబట్టదు. అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఎన్నికలు వాయిదా కాదు, రీ నోటిఫికేషన్ ఇవ్వాలి. వైసిపికి సహకరిస్తున్న అధికారులపై డీవోపీటిలో పిటిషన్ వేస్తాం.

వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

చంద్రబాబుకు ఇంకా మైండ్ సెట్ మారలేదు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇసి రమేష్ కుమార్, చంద్రబాబు కుట్ర వల్లనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు కరోనా కారణంగా చెప్పడం సరికాదు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Leave a Comment