రాజకీయ నాయకుల స్నేహం గురించి చెప్పాలంటే గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి కేవీపీ రామచంద్రరావు గురించి ప్రస్తావించేవారు.ఆ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ స్నేహితులు.విచిత్రమేమిటంటే వైయస్ రాజశేఖర్రెడ్డి మరణించాక ఆయన కుమారుడు జగన్ తోటి కేవీపీ రామచంద్రరావుకు సంబంధాలు లేకుండా పోయాయి.అదే విధంగా భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆయన కుమార్తె అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డితో వైరం కూడా ఏర్పడింది.
అదిప్పుడు తీవ్రస్థాయి ఆరోపణలకు దారితీస్తోంది ఏవీ సుబ్బారెడ్డి ఆయన కుమార్తె భూమా అఖిలప్రియపై దుమారం రేపే ఆరోపణలు చేస్తున్నారు అఖిలప్రియ దంపతులు తన హత్యకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారంటూ ఏవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.గతంలో ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేశారంటూ ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాకు సుపారీ ఇచ్చారని కూడా పోలీసులు గుర్తించారు. ఎవరు ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..? అలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ.. ఏవీ సుబ్బారెడ్డి మాత్రం ఆ సుపారీ ఇచ్చింది అఖిలప్రియ దంపతులేనని మీడియా ఎదుట ఆరోపించారు. దీనిపై అఖిలప్రియ మండిపడ్డారు. పోలీసులు చెప్పకుండా తమపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. వెంటనే.. ఏవీ సుబ్బారెడ్డి తనకు పోలీసులే అఖిలప్రియ దంపతులు కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చారని చెప్పారని తన ఆరోపణను సమర్థించుకున్నారు. భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి ల రాజకీయ జీవితానికి తన ప్రాణాలు అడ్డేసి.. అనేక సందర్భాల్లో బాంబు దాడులను ఎదుర్కొన్నానన్నారు. ఇప్పుడు వారి కుమార్తె తనను చంపడానికి సుపారి ఇచ్చేంత తప్పు తానేం చేశానని ఆయన ప్రశ్నిస్తున్నారు. . ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉండి… ఇలా ఒకరిపై ఒకరు సీరియస్గా హత్యయత్నాలు.. సుపారీ ఆరోపణలు చేసుకుంటూండటం.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. అయితే సుబ్బారెడ్డి హత్యకు కిరాయి హంతకులకు సుపారి ఎవరిచ్చారన్న విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే వారు స్పందిస్తే తప్పితే ఈ వివాదం సద్దుమణగదు