పూరి జగన్నాధ్ ఒక హీరోయిన్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడంటే..ఖచ్చితంగా ఆ బ్యూటి కి టాలెంట్ తో పాటు అదిరిపోయో అందం ఉంటుంది. ఈ విషయం ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల ద్వారా పరిచయం చేసిన హీరోయిన్స్ లిస్ట్ చూస్తే అర్థం అవుతుంది. అయితే చాలామంది ఆ తర్వాత కథ లు ఎంపిక లో రాంగ్ స్టెప్ వేసి పూరి ఇచ్చిన లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారు. ఇక పూరి గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ తోను ఒకటి రెండు సినిమాలు చేసినా ఎవరూ గుర్తించని హీరోయిన్స్ కి మంచి లైఫ్ ఇచ్చాడు. వాళ్ళే నిధీ అగర్వాల్, నభా నటెష్.
ఈ ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. నభా అయితే 2021 మొత్తం ఖాళ్ళీ లేనన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇక పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అన్న డైలమాలో పూరి చాలా రోజులు ఉన్నాడు. మరోసారి నిధీ అగర్వాల్ విజయ్ సరసన నటింపచేయాలని అనుకున్నాడు పూరి. ఆ తర్వాత శ్రీదేవి కూతు జాన్వీ కపూర్ ని అనుకున్నారు. ఆమెతో సంప్రదింపులు జరిపాడు. కాని వర్కౌట్ కాలేదు. చివరికి ఆ అవకాశం అనన్య పాండే దక్కించుకుంది. బాలీవుడ్ విలన్ చుంకీ పాండే కూతురు అయిన ఈ బ్యూటి బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసినా రాని ఫేం పూరి సినిమాలో నటిస్తుందనగానే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.
కనీసం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ సినిమా ఫస్ట్ లుక్ గాని టీజర్ గాని బయటకు రాకుండానే టాలీవుడ్ యంగ్ హీరోలు తన డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. హాట్ హాట్ లుక్స్ తో మేకర్స్ తో పాటు టాలీవుడ్ హీరోలని అనన్య బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామర్ అండ్ హాట్ బ్యూటి వచ్చి చాలా రోజులైంది. దాంతో ఇప్పుడు టాలీవుడ్ హీరోల కన్ను అనన్య మీద పడింది. మరి టాలీవుడ్ లో ఈ బ్యూటి సక్సస్ అవుతుందా లేక ఒక సినిమాతో ముంబై ఫ్లైటెక్కేస్తుందా చూడాలి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!