AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి హజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు. సీఎం జగన్ రాక సందర్భంగా భీమవరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాధ రాజు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపి కే శ్రీధర్, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.