రాష్ట్రంలో పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రతేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలను 2024 మార్చి నాటికి ప్రారంభం కావాలని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు అన్నీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. జవ్వులదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ల పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ పనులను 2023 జూన్ కల్లా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి కుటుంబానికి పది లక్షల సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
రాష్ట్రానికి మంజూరైన బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ ప్రణాళికపై అదికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కంపెనీలు పెట్టేందుకు భారీ ఫార్మా కంపెనీల నుండి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని అధికారులు వివరించారు. ఇండస్ట్రియల్ కారిడార్లపై సీఎం జగన్ సమీక్షించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాలో రెండు క్లస్టర్ల చొప్పున ఎంఎన్ఎంఈలు నెలకొల్పాలని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక నోడల్స్ ను అభివృద్ధి చేయాలని చెప్పిన సీఎం జగన్.. మచిలీపట్నం నోడ్, దొనకొండ, భావనపాడు, రామాయపట్నం నోడ్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ